గజ్వేల్, ఫిబ్రవరి 6: అభివృద్ధిలో సిద్దిపేట జిల్లా అగ్రగామిగా నిలిచిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అభివృద్ధిని చూసి కేంద్రం అనేక అవార్డులు ఇచ్చిందని, అందులో కేసీఆర్, హరీశ్రావు కృషి మరువలేనిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలోని ఇతర జిల్లాలను అభివృద్ధి చేయాలన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలను బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుచుకుంటారని, రాష్ట్ర ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్రెడ్డి హుందాగా మాట్లాడాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. రైతుబంధు కోసం కర్షకులు ఎదురుచూస్తున్నారని, హామీలు అమలు చేయకుండా గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ కూడా జాప్యం చేయలేదన్నారు. జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం చేసి రైతాంగానికి సాగునీరందించిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. అభివృద్ధిలో సిద్దిపేట జిల్లా రాష్ర్టానికే మోడల్గా నిలిచిందన్నారు. జిల్లాలో నూతన కలెక్టరేట్, అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం, అటవీ కళాశాల, మెడికల్ కళాశాల, జిల్లా దవాఖాన, విశాలమైన రోడ్లు, కొత్త భవనాల నిర్మాణాలు చేపట్టారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నవాజ్మీరా, నాయకులు ఎక్బాల్, శ్రీనివాస్, భిక్షపతి, నరేశ్, కుమార్, కనకరాజు, పోచయ్య, అఖిల్, స్వామి, ప్రకాశ్ పాల్గొన్నారు.