పాపన్నపేట, డిసెంబర్ 4: ఏడుపాయల వనదుర్గాభవానీమాత సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయలకు చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో, చెక్డ్యాంలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికొందరు అమ్మవారికి బోనాలు, తలనీలాలు, ఒడిబియ్యం, కుంకుమార్చనలు నిర్వహించారు.
భక్తుల సౌకర్యాల కల్పనలో పాలకమండలి చైర్మన్ బాలాగౌడ్, ఈవో శ్రీనివాస్లు తగిన చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పాలక మండలి సభ్యులు వెంకటేశ్, మనోహర్, మోహన్రావు, శ్రీనివాస్రావు, పెంటయ్య, సాయిలు, బాగారెడ్డి, యాదయ్యతో పాటు ఆలయ సిబ్బంది మధుసూదన్రెడ్డి, లక్ష్మీనారాయణ, రవివీర్కుమార్, మహేశ్, యాదగిరి, నర్సింలు, వరణాచారి తదితరులు ఏర్పాట్లు చేశారు. వేదపండితులు శంకర్శర్మ, పార్థివశర్మ, రాజశేఖర్శర్మ, రాజేశ్శర్మ, నాగరాజుశర్మ, రాముశర్మ తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్సై విజయ్కుమార్ తమ సిబ్బందితో తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు.