చేగుంట : నిరుద్యోగులు పనిలేక వృథాగా ఉండకుండా ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు. మండల కేంద్రమైన చేగుంటలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో బుధవారం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెదక్ జిల్లా వారి సహకారంతో 16మంది లబ్ధిదారులకు కుట్టుమిషన్లను అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వారు నిరుద్యోగులకు ఉపాధి కోసం అనేక ట్రేడ్లలో శిక్షణ అందిస్తున్నారని వివరించారు.ఆసక్తి ఉన్న వారు కుట్టు మిషన్, ఎంబ్రాయిడింగ్లతో పాటు గృహ నిర్మాణాలు, కారు, జేసీబీ మెకానిజం, వివిధ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు.ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్ ప్రవీన్ కుమార్, డీసీఎంఎస్ జిల్లా డైరెక్టర్ సండ్రుగు స్వామి, ఎంపీటీసీలు అయిత వెంకటలక్ష్మి, బింగి గణేశ్, సర్పంచులు కొటారి అశోక్, కాశబోయిన భాస్కర్, బుడ్డ స్వర్ణలత, రైతుబంధు జిల్లా డైరెక్టర్ చెర్యాల మోహన్రెడ్డి, ఎంపీడీవో ఉమాదేవి, తాసీల్దార్ విజయలక్ష్మి, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ జిల్లా ఇన్చార్జి నిజాముద్దిన్, ఉమ్మడి జిల్లా ఏడీ రామ్రెడ్డితో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.