టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావులపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం దుబ్బాక నియోజకవర్గవ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మలను టీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశాయి. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ టీవీ చానల్లో ఎమ్మెల్యే రఘునందన్ మాట్లాడిన తీరును దుబ్బాక ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు. బుధవారం దుబ్బాక నియోజకవర్గ కేంద్రంతో పాటు తొగుట, మిరుదొడ్డి, అక్బర్పేట- భూంపల్లి, దౌల్తాబాద్, రాయపోల్, చేగుంటతో పాటు పలు గ్రామాల్లో టీఆర్ఎస్ ముఖ్యనాయకులు, ఆయా మండలాల పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు దిష్టిబొమ్మలను ఊరేగించి దహనం చేశారు. దుబ్బాక ప్రజల ఓట్ల కోసం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? వాటిని మర్చిపోయావా అంటు రఘునందన్ను ప్రశ్నించారు.
దుబ్బాక నెట్వర్క్, చేగుంట, అక్టోబర్ 26 : మునుగోడులో మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేని యేడల దుబ్బాక వ్యాప్తంగా నిరసన చేస్తామని చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, జిల్లా నాయకుడు రంగయ్యగారి రాజిరెడ్డి అన్నారు. చేగుంటలో బుధవారం గాంధీ చౌరస్తా నుంచి మక్కరాజిపేట రోడ్డు వరకు రఘునంధన్రావు డౌన్డౌన్ అంటూ నినదాలు చేస్తూ దిష్ఠి బొమ్మను ఊరేగించి దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తానని చెప్పి తేకపోతివని ప్రశ్నించారు. రాష్ర్టానికి వచ్చే నిధులను ఇవ్వకుండ మోసం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం కా దా ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, మంత్రి హరీశ్రావులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను రఘునంధన్రా వు వెనక్కుతీసుకొని బెషరతుగా క్షమాపణ చెప్పాలని లేని చో దుబ్బాక నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి ఇ దే తరహా నిరసన ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సండ్రుగు స్వామి, ఎర్ర యాదగి రి, ఎంపీటీసీ బింగి గణేశ్, నాయకులు బక్కి రమేశ్, గాం డ్ల నందం, మండల మైనార్టీ అధ్యక్షుడు ఆలీ, నదీమ్, సోమ సత్యనారాయణ, లక్ష్మణ్, జనరల్సింగ్, రాజేశ్, నరేశ్, శ్రీను, భాస్కర్, అంజిరెడ్డి, నర్సింహులు ఉన్నారు.
మంత్రిని విమర్శించే స్థాయి ఎమ్మెల్యేకు లేదు
రాయపోల్ అక్టోబర్ 26: ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన ఎమ్మెల్యే రఘునందన్రావు మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్రావుపై అనుచిత వ్యాఖ్య లు చేసినందుకు నిరసనగా మండల టీఆర్ఎస్(బీఆర్ఎస్) శ్రేణులు బుధవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మె ల్యే దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు వెంకటేశ్వరశర్మ మాట్లాడుతూ మచ్చలేని నాయకుడిగా గుర్తిం పు తెచ్చుకున్న మంత్రి హరీశ్రావును విమర్శించడం రఘునందన్రావుకు తగదన్నారు.
టీవీ షోల్లో షోచేసే ఎమ్మెల్యేకు పాడెకడుతాం
దౌల్తాబాద్, అక్టోబర్ 26 : దుబ్బాక ఎమ్మెల్యే రఘు నందన్రావు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి నిత్యం టీవీ షోల్లో మాట్లాడడం తప్ప నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు కొమ్మెర పూజితావెంకట్రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు రహీమొద్దీన్, అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రులు హరీశ్రావు, కేటీఆర్పై ఎమ్మె ల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తా వద్ద ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) కార్యకర్తలు దిష్టిబొమ్మ దహనం చేశారు.
సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడడం సిగ్గుచేటు
మిరుదొడ్డి, అక్టోబర్ 26 : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు మంత్రులపై మాట్లాడిన విధానం చూస్తే సభ్య సమాజం తలదించుకునేలా ఉందని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) రాష్ట్ర కార్యదర్శి, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య అన్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడుతూ బుధవారం అక్బర్పేట-భూంపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల్లో సామాన్య ప్రజలు కూడా మాట్లాడని భాషను ఎమ్మెల్యే మాట్లాడం సిగ్గుచేటన్నారు.