చిలిపిచెడ్,ఏప్రిల్ 27 : కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల కేంద్రానికి చెందిన బుక్క నాయబ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడికి టీఆర్ఎస్ సభ్యత్వం ఉంటడంతో పార్టీ ద్వారా మంజూరైన రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కును బుధవారం హైదరాబాద్లోని నర్సాపూర్ ఎమ్మెల్యే స్వగృహంలో మృతి చెందిన సోదరునికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ హన్మంత్,నాయకులు దుర్గారెడ్డి,కిషన్రెడ్డి,విష్ణు ఉన్నారు.