కౌడిపల్లి, జూలై 22: కౌడిపల్లి మండలం మహమ్మద్నగర్ గ్రామానికి చెందిన రైతు మహిపాల్రెడ్డి 8 ఎకరాల్లో టమాట సాగుచేశాడు. ఈసారి టమాట రైతుకు సిరులు కురిపించింది. మహిపాల్రెడ్డి 8 వేల బాక్సుల టమాటలను మార్కెట్లో విక్రయించగా రూ.1.84 కోట్ల ఆదాయం వచ్చిం ది. రోజూ 250 బాక్సులు టమాట అమ్ముతున్నా డు. వేసవిలో టమాట పండించాలన్న తపన ఆయనలో ఉండేది. వేసవిలో ఇతర రాష్ట్రాల నుంచి టమాటను ఎందుకు దిగుమతి చేసుకోవాలని, తెలంగాణలోనూ ఏప్రిల్, మే నెలలో టమా ట పండించాలనే తపనతో సాగు చేశాడు. రైతు మహిపాల్రెడ్డి పండిస్తున్న టమాట క్వాలిటీగా ఉండడంతో వ్యాపారులు ఎక్కువగా కొంటున్నా రు. మంథన, బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన టమాటా కంటే మహిపాల్రెడ్డి పండించిన టమాటకు ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు.
ఆధునిక పద్ధతులతో సాగు
ఆధునిక పద్ధతులు పాటిస్తూ, మొక్కకు మొక్కకు గ్యాప్ ఇస్తూ టమాటను పండిస్తున్నాడు. మహిపాల్రెడ్డి స్వశక్తితో, సొంత ఆలోచనలతో టమాటను పండిస్తున్నాడు. నీటి శాతం, తక్కువ పెట్టుబడితో డ్రిప్తో పాటు ఆధునిక పద్ధతిలో పంట పండిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు. దీంతో ఆంధ్రప్రదే శ్, బెంగళూరు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తమిళనాడుతో పాటు మరో ఎనిమిది రాష్ట్రాల శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, రైతులు వచ్చి ఆయన పంట పండిస్తున్న తీరుతెన్నులను పరిశీలించారు.
అవార్డు అందజేసిన ఉప రాష్ట్రపతి
తెలంగాణ ఉత్తమ రైతుగా ఎంపిక కావడంతో హైదరాబాద్లో అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రైతు మహిపాల్రెడ్డికి అవార్డు అందజేశారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉత్తమ రైతు అవార్డులు అందుకున్నారు.
రోజుకు 100 మందికి ఉపాధి
మహిపాల్రెడ్డి పంటలు పండిస్తూ తనతోపాటు సుమారు 100 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. కూరగాయలు తెంపడానికి, కలుపు తీయడానికి, ఇతర పనులకు మహిళా కూలీలు పనిచేస్తున్నారు.
ఇంకా కోటి 80 లక్షల క్రాప్ ఉంది
మహిపాల్రెడ్డి ఇప్పటికే రూ.1.84 కోట్ల విలువైన టమాట అమ్మాడు. ఇంకా రూ.1.80 కోట్ల టమాట పంట మిగిలి ఉంది. సగం పంట మాత్రమే కోశానని, ఇంకా సగం పంట కాత ఫుల్గా ఉన్నదని, రేటు తగ్గినా కోటి రూపాయలు వస్తదని ఆయన చెబుతున్నాడు. రోజూ డీసీఎం, ట్రక్కుల్లో మార్కెట్కు టమాటాను తీసుకెళ్తున్నాడు. బోయిన్పల్లి మార్కెట్లో ఒక్కో బాక్స్కు రూ.2300 నుంచి 2500 ధర పలుకుతున్నది. దీంతో ఒక్కరోజే 550 బాక్సులు అమ్మి రూ.13.75 లక్షలు ఆర్జించాడు. రోజూ బోయిన్పల్లి, పటాన్చెరు, షాపూర్నగర్ మార్కెట్లలో టమాట విక్రయిస్తున్నాడు.
ఆ రైతు సంకల్పించాడు. ఎంత కష్టమైనా తనకు ఇష్టమైన టమాట పంటను తనకున్న 8 ఎకరాల్లో వేశాడు. కొన్ని సందర్భాల్లో నష్టం వాటిల్లినా, అధైర్యపడకుండా మళ్లీ ప్రయత్నించాడు. దీంతో ఈసారి టమాట ఆ సామాన్య రైతును ఆదుకున్నది. సిరులు కురిపిస్తున్నది. టమాట ధరలు చుక్కలను తాకుతుండడంతో ఒక్కసారిగా ఆ రైతును కోటీశ్వరుడిని చేసింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్నగర్ గ్రామానికి చెందిన రైతు మహిపాల్రెడ్డి ఆధునిక పద్ధతిలో సాగు చేసిన టమాట పంట నేడు లాభాలు తీసుకొచ్చి పెడుతున్నది.
24 గంటల ఉచిత విద్యుత్తో సాధ్యమైంది
టమాటపై కోటి రూపాయల వరకు సంపాదించానంటే దానికి సీఎం కేసీఆరే కారణం. సీఎం సారు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తో టమాటను పండించా. గతంలో కరెంట్ విషయంలో చాలా ఇబ్బందులు ఉండేవి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు చాలా మేలు జరిగింది. ఈ ప్రభుత్వం హార్టికల్చర్, రైతులపై దృష్టి పెట్టి, వారికి సబ్సిడీలు అందజేయాలి. 2008 నుంచి కూరగాయలు సాగు చేస్తున్నా. గతంలో నష్టాలు చూశా. ఒకసారి ఏకంగా రూ.20 లక్షల నష్టం వచ్చింది. దీంతో ఆధునిక పద్ధతులు, సీజన్ను బట్టి పంట వేసి సక్సెస్ అయ్యా. వేసవిలో టమాటా దొరకదు. నేను పండించి తెలంగాణలో నెంబర్వన్గా ఉండాలని నా కోరిక. ఇప్పటికే ఏటా వేసవిలో పండిస్తున్నా. ఇతర రాష్ట్రాల నుంచి టమాట తీసుకురాకుండా తెలంగాణ నుంచి టమాట వస్తున్నదని ఇక్కడి రైతులు చాటి చెప్పాలి. తక్కువ నీటితో అధిక లాభాలతో పండిస్తా. ఎకరాకు రెండు లక్షల ఖర్చు వచ్చింది. ఈసారి టమాటాకు రేటు ఉండడంతో రూ.1.50 కోట్లు వచ్చాయి. ఇంకా కోటి 84 లక్షలు పంట ఉంది. పంటను నమ్ముకున్న రైతుకు గుర్తింపు ఇస్తుందని నా నమ్మకం. – మహిపాల్ రెడ్డి, రైతు, మహమ్మద్నగర్(మెదక్ జిల్లా)
రోజూ ఉపాధి దొరుకుతున్నది
మహిపాల్రెడ్డి కూరగాయల పొలంలో పని చేస్త్తూ రోజూ ఉపాధి పొందుతున్నా. టమాట పంటకు మంచి లాభం రావడం చాలా సంతోషం. నాతో పాటు చాలా మంది ఈ పొలంలో పని చేస్తున్నారు. పంటను పసిపిల్లల మాదిరిగా చూసుకుంటూ లాభాలు తెచ్చుకున్నాడు. ఇతర రైతులు కూడా ఇలానే పంటను పండించుకుని లాభం పొందాలి.
– శాంతమ్మ, కూలీ, మహమ్మద్నగర్ (మెదక్ జిల్లా)