సిద్దిపేట రూరల్, నవంబర్ 29 : మండలంలోని చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో సీఎం కేసీఆర్ దంపతులు గురువారం ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బుధవారం సీపీ శ్వేత ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెలిప్యాడ్, పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తుపై తగిన ఆదేశాలు ఇచ్చారు. ఓటు జాబితాలో సీఎం కేసీఆర్ సీరియల్ నం :158 కాగా, ఓటరు కార్డు సంఖ్య: ఎస్ఏజీ 0399691, సీఎం కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభారాణి సీరియల్ నం :159 ఓటరుకార్డు సంఖ్య :ఎస్ఏజీ0761676, ఇరువురి ఇంటినెం :3-37 సీఎం కేసీఆర్ రానుండడంతో గ్రామస్తుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
చింతమడకలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని మంత్రి హరీశ్రావు పరిశీలించారు. కాగా సిద్దిపేటలోని భారత్నగర్ అంబిటస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో హరీశ్రావు దంపతులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.