శివ్వంపేట, నవంబర్ 29 : చిరుత దాడిలో మూడు గేదె దూడలు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నత్నాయిపల్లి గ్రామశివారులో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎస్. ప్రవీణ్కుమార్ రోజులాగే సోమవారం తన గేదెలను పొలం వద్ద కట్టేసి ఇంటికి వెళ్లాడు. సోమవారం రాత్రి చిరుత గేదె దూడలపై దాడి చేసి చెట్టు పైకి లాక్కెళ్లింది. దీంతో రెండు దూడలు చెట్టుకు వేలాడపడగా మెడకు ఉన్న తాడు బిగుసుకొని ఊపిరాడక చనిపోయా యి. తర్వాత పక్కనే ఉన్న మరో దూడపై చిరుత దాడి చేసి, చంపి తినేసింది.
చిరుత దాడి విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకు ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఫారెస్టు అధికారులు సెక్షన్ ఆఫీసర్ బాలేశ్గౌడ్, బీట్ ఆఫీసర్ ప్రశాంత్ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి పంచనామా నిర్వహించారు. సెక్షన్ ఆఫీసర్ బాలేష్గౌడ్ మాట్లాడుతూ నత్నాయిపల్లి అటవీప్రాంతంలో చిరుత సంచరిస్తున్నందున రైతులు తమ పశువులను పంట పొలాల వద్ద ఉంచకుండా ఇంటివద్దనే ఉంచుకోవాలని సర్పంచ్ సాయమ్మ సత్యనారాయణ సూచించారు. ప్రజలు కూడా అప్రమ త్తంగా ఉండాలని వారు తెలిపారు.