మెదక్, ఫిబ్రవరి 23: ఎండలు అప్పుడే మండుతున్నాయి. వేసవిలో దాహం ఎక్కువగా ఉండడం సహజం. వనరులు ఎన్ని ఉన్నా తాగునీటి కోసం కోటి తిప్పలు తప్పవు. ఉష్ణ తాపానికి అల్లాడిపోయే జీవాలెన్నో గొంతు తడుపుకోవడం ద్వారా కాస్త ఉపశమనం కోరుకుంటాయి.
ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయన్న సంగతి ఈ కోతులు పడుతున్న పాట్లను చూస్తే ఇట్టే అర్థమవుంది. మెదక్ జిల్లాకేంద్రంలోని మిషన్ భగీరథ ట్యాంక్ వద్ద కొన్ని వానరాలు దాహం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తూ ‘నమస్తే తెలంగాణ’ కెమెరాకు చిక్కాయి.
ఫొటోలు: నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్, మెదక్