పాపన్నపేట, జనవరి 21: మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఏడుపాయలకు చేరుకున్న భక్తులు వివిధ పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి దుర్గామాతను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, తలనీలాలు, కుంకుమార్చనలు, బోనాలు సమర్పించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏడుపాయల ఆలయ చైర్మన్ సతెల్లి బాలాగౌడ్, ఈవో మోహన్రెడ్డి ,సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి,రవివీర్ కుమార్, లక్ష్మీనారాయణ, ప్రతాప్రెడ్డి, తోట నరసింహులు, వరుణాచారి, రాజు, శ్రీకాంత్, సంతోష్, యాదగిరి తదితరులు ఏర్పాట్లు చేశారు. వేదపండితులు శంకరశర్మ, పార్థివశర్మ, మురళీధర్ ప్రత్యేక పూజలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పాపన్నపేట ఎస్సై మహిపాల్రెడ్డి బందోబస్తు చర్యలు చేపట్టారు.