పాపన్నపేట, డిసెంబర్ 17: పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధిలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొన్నది. పలు ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి, దుర్గామాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
పలువురు భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చన, తలనీలాలు, బోనాలు సమర్పిం చి మొక్కుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏడుపాయల చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్, ఆలయ ఈవో మోహన్రెడ్డి, సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్రెడ్డి, రవివీర్ కుమార్, లక్ష్మీనారాయణ, ప్రతాప్రెడ్డి, తోట నరసింహులు, వరుణాచారి, రాజు, శ్రీకాంత్, సంతోష్, యాదగిరి ఏర్పాట్లు చేశారు. వేద పండితులు శంకర శర్మ, పార్థీవ శర్మ, మురళీధర్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. పాపన్నపేట ఎస్సై మహిపాల్రెడ్డి బందోబస్తు చర్యలు చేపట్టారు.