ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు ఫ్లెక్సీలు, ప్లకార్డులతో ర్యాలీలు నిర్వహించారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబమని,జనాభా నియంత్రణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రామాయంపేట/ పెద్దశంకరంపేట, జూలై11: జనాభా నియంత్రణను ప్రతి ఒక్కరూ పాటించాలని మండల వైద్యులు లావణ్య, హరిప్రియ, సాయికృష్ణ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రామాయంపేట పట్టణంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, స్టాప్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఉన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పెద్దశంకరంపేటలో పీహెచ్సీ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి వికాస్, వైద్యులు వేదశ్రీ, శ్రీహర్ష, విదాత్రి, కవిత, పీహెచ్సీ సిబ్బంది యాదయ్య, శ్రీదేవి, భూమయ్య, వెంకటరమణ, వెంకటేశం, సాయిలు, వెంకటేశం, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.