అందోల్/కొల్చారం, డిసెంబర్ 24 : రోడ్లను పొగమంచు కమ్మేసింది. ఆదివారం ఉదయం రోడ్లు మొత్తం మంచుతో కప్పేసి కశ్మీర్ను తలపించింది. ఉదయం 9దాటినా సూర్యుడు కనపబడలేదు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
తప్పనిసరి పరిస్థితిలో హెడ్లైట్ల వెలుతురులో వాహనాల రాకపోకలు సాగించారు. జోగిపేట క్లాక్టవర్, జోగినాథాలయం, రంగనాథ ఆలయం, బస్టాండ్, కొల్చారంలో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో పలువురు ఈ దృశ్యాలను సెల్ ఫోన్లలో చిత్రీకరించారు.