మెదక్ అర్బన్, డిసెంబర్ 19 : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కండక్టర్ కుటుంబానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భరోసా కల్పించింది. బాధిత కుటుంబానికి యూనియర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించింది. నాలుగు నెలల క్రితం మెదక్ డిపోకు చెందిన కండక్టర్ సీహెచ్ అంజయ్య రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందాడు. మంగళవారం హైదరాబాద్ బస్ భవన్లో అంజయ్య కుటుంబానికి రూ.40 లక్షల విలువైన చెక్కును యూబీఐ అధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అందజేశారు.
దీంతో భార్య మణెమ్మతో పాటు కుమారుడు సంతోష్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు డాక్టర్ రవీందర్,ఈడీలు కృష్ణకాంత్, పీవీ మునిశేఖర్, పురుషోత్తం, సీపీఎం ఉషాదేవి, యూబీఐ జనరల్ మేనేజర్ కృష్ణణ్, సిద్దిపేట రీజనల్ హెడ్ వికాస్, చీఫ్ మేనేజర్ రమేశ్, మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సుధ పాల్గొన్నారు.