అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో మొత్తం 224 మంది అభ్యర్థులు.. 320 నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడం విశేషం. సోమవారం నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. బరిలో నుంచి తప్పుకోవాలనుకుంటున్న వారికి ఈనెల 15 వరకు ఉపసంహరణ గడువు ఉంది. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా వెల్లడి కానున్నది. ఆ తర్వాత ప్రచారం మరింత ఊపందుకోనున్నది.
సిద్దిపేట అర్బన్, నవంబర్ 11: అసెంబ్లీ ఎన్నికల కోసం జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. జిల్లాలోని దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో మొత్తం 320 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 3వ తేదీన నోటిఫికేషన్ రావడంతో అదేరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 3వ తేదీ నుంచి 10 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన ఉండగా, 15వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. మొదటి రోజు కేవలం 3 నామినేషన్లు మాత్రమే దాఖలు కాగా, చివరి రోజు 152 దాఖలయ్యాయి. జిల్లాలో అత్యధికంగా గజ్వేల్ నియోజకవర్గంలో 154 నామినేషన్లు దాఖలు కాగా, అత్యల్పంగా దుబ్బాక నియోజకవర్గంలో 38 దాఖలయ్యాయి. సిద్దిపేట నియోజకవర్గంలో 76, హుస్నాబాద్లో 52 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.
మొదటి రోజు గజ్వేల్ నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులు మూడు నామినేషన్లు దాఖలు చేయగా.. రెండో రోజు శనివారం హుస్నాబాద్లో ఒక అభ్యర్థి ఒకటి, సిద్దిపేటలో ఇద్దరు అభ్యర్థులు రెండు, దుబ్బాకలో ముగ్గురు అభ్యర్థులు 3 నామినేషన్లతో మొత్తం 6 దాఖలు చేశారు. మూడోరోజు సోమవారం హుస్నాబాద్లో ముగ్గురు అభ్యర్థులు 3, సిద్దిపేటలో ఇద్దరు అభ్యర్థులు 2, దుబ్బాకలో ముగ్గురు 3, గజ్వేల్లో ఒక్కరు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయగా.. మొత్తం 9 నామినేషన్లు దాఖలయ్యాయి. నాలుగో రోజు మంగళవారం సిద్దిపేటలో 5గురు అభ్యర్థులు 5, దుబ్బాకలో నలుగురు 4, గజ్వేల్లో ఆరుగురు అభ్యర్థులు 7 నామినేషన్లు దాఖలు చేయగా, మొత్తం 16 నామినేషన్లు దాఖలయ్యాయి. ఐదో రోజు బుధవారం హుస్నాబాద్లో ఆరుగురు అభ్యర్థులు 9, సిద్దిపేటలో 12 మంది 12, దుబ్బాకలో ఐదు మంది 5, గజ్వేల్లో 25 మంది 27 నామినేషన్లు మొత్తం 53 దాఖలు చేశారు. ఆరో రోజు గురువారం హుస్నాబాద్లో ఆరు మంది 6, సిద్దిపేటలో 17 మంది 20, దుబ్బాకలో ఐదు మంది 7, గజ్వేల్లో 43మంది 48 నామినేషన్లు దాఖలు చేయగా, మొత్తం 81దాఖలయ్యాయి. చివరి రోజు దుబ్బాకలో 14 మంది అభ్యర్థులు 16, హుస్నాబాద్లో 27 మంది అభ్యర్థులు 33, సిద్దిపేటలో 32 మంది అభ్యర్థులు 35, గజ్వేల్లో 68 మంది 68 నామినేషన్లు దాఖలు చేయగా.. మొత్తంగా చివరి రోజు 152 దాఖలయ్యాయి. సిద్దిపేట నియోజకవర్గంలో 39 మంది అభ్యర్థులు 76 నామినేషన్లు, గజ్వేల్ నియోజకవర్గంలో 127 మంది అభ్యర్థులు 152 నామినేషన్లు, హుస్నాబాద్లో 36 మంది అభ్యర్థులు 49 నామినేషన్లు, దుబ్బాకలో 22 మంది అభ్యర్థులు 38 నామినేషన్లు దాఖలు చేయగా, మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో 320 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.