మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 29 : పట్టణంలో మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదని, త్వరగా సమస్య పరిష్కరించి తాగునీటి ని అందించాలని కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు ఫిర్యా దు చేశారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన మున్సిపల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్లు బట్టి లలిత, లక్ష్మీనారాయణగౌడ్, జయరాజ్ తదితరులు మాట్లాడుతూ.. వార్డుల్లో మిషన్ భగీరథ నీటి పంపిణీ సరిగా జరగడం లేదని, అధికారుల ఆలసత్వంతోనే తాగునీరు ప్రజలకు అందించలేక పోతున్నట్లు పేర్కొన్నారు.
చైర్మన్ జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించి నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఈ మహేశ్ను ఆదేశించారు. పట్టణంలోని క్రీడా ప్రాంగణాల్లో ప్రజలకు ఉపయోగపడేలా క్రీడా పరికరాలు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు ఆంజనేయ లు, కల్యాణి కోరారు. కోతులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నార ని, కోతుల విషయంలో చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ మేఘమాల కోరారు. గిద్దకట్ట శ్మశాన వాటికలో విద్యుత్ దీపాలు లేకపోవడంతో రాత్రివేళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కౌన్సిలర్ కృష్ణారెడ్డి పేర్కొ న్నారు.
29వ వార్డులో భగీరథ నీటి సరఫరాలో సమయపాలన పా టించకపోవడంతో నీరు వృథాగా పోతున్నాయని డీఈ మహేశ్ దృష్టికి కౌన్సిలర్ రుక్మిణి తెచ్చారు. సమావేశ ఎజెండా అంశాలను ఆమోదించారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, కమిషనర్ జానకిరాంసాగర్, కౌన్సిలర్లు కిశోర్, సమీయొద్దీన్, గాయత్రి, మమత, రాజలింగం, చందన, మానస, సుంకయ్య, శేఖర్, వసంత్రాజ్, ఏఈలు కిష్టయ్య, బాలసాయగౌడ్, టీపీవో భూపతి, ఆర్వో హర్షద్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.