అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నామస్మరణ మార్మోగింది. ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. గ్రామాల్లో శోభాయాత్రలు, కోలాటం, మేళతాళాలు వైభవంగా జరిగాయి. పలు చోట్ల అన్నదానం చేశారు.
బాలరాముడి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా ఆయా గ్రామాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రాముడు, సీత, హనుమాన్ వేషధారణలతో చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు.