నర్సాపూర్,జనవరి 30 : 22తులాల వెండిని అపహరించిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సోమవారం ఎస్సై గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణంలోని గాంధీ విగ్రహం సమీపంలో శివంపేట్ మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన అరిగే కృష్ణవేణి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది.
ఆదివారం రూమ్కి తాళం వేసి కొడుకుతో కలిసి పిల్లుట్ల గ్రామానికి వెళ్లింది. అదే రాత్రి దుండగులు ఇంటి తాళాలను పగులగొట్టి బీరువాలో ఉన్న 22తులాల వెండి నగలను అపహరించారు. అదే రాత్రి నర్సాపూర్ పట్టణంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ సమీపంలో నివసించే పాషా అనే ఇంట్లో కూడా తాళాలు పగులగొట్టి చోరికీ యత్నించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.