సిద్దిపేట పట్టణ శివారులోని పొన్నాల వైజంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మంత్రి హరీశ్రావు కృషితో రూ.24 కోట్ల వ్యయంతో కిలోమీటర్ మేర మూడు లేన్లతో ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. త్వరలో దీనిని ప్రారంభించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాదాలకు చెక్ పడనున్నది. గతంలో సిద్దిపేట ప్రజలకు, కరీంనగర్ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వాహనదారులకు పొన్నాల దాబా జంక్షన్ వద్ద ఎంతో ఇబ్బందిగా ఉండేది. రాజీవ్ రహదారిపై వేగంగా వచ్చే వాహనాలతో తరుచూ ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. ఇకపై వీటన్నింటి నుంచి విముక్తి లభించనున్నది. ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తుండడంతో వాహనదారులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 12: సిద్దిపేట ప్రజలకు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో పట్టణ శివారులోని పొన్నాల వైజంక్షన్ వద్ద తలపెట్టిన ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో రూ.24 కోట్ల నిధులతో కిలోమీటర్ పొడవుతో ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. ఏడాది క్రితం పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ పనులు పూర్తయినందున త్వరలో ప్రారంభించనున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే పొన్నాల జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుండడంతో ఇటు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వాహనదారులకు, సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వారికి ఎంతో సౌకర్యంగా మారనున్నది.
సిద్దిపేట పట్టణ శివారులోని పొన్నాల దాబాల వద్ద ఫ్లైఓవర్ను మూడు లేన్లతో నిర్మించారు. రూ.24 కోట్ల నిధులతో కిలోమీటర్ పొడవు, 11 మీటర్ల వెడల్పుతో దీన్ని నిర్మించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే రాజీవ్ రహదారిపై ఇక నుంచి రాకపోకలు సాఫీగా సాగనున్నాయి. పరిసర గ్రామాల ప్రజలతోపాటు సిద్దిపేట పట్టణ ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పొన్నాల వై జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్తో రోడ్డు ప్రమాదాలకు చెక్ పడనున్నది. గతంలో సిద్దిపేట ప్రజలకు, కరీంనగర్ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వాహనదారులకు పొన్నాల దాబా జంక్షన్ వద్ద ఎంతో ఇబ్బందిగా ఉండేది. రాజీవ్ రహదారిపై వేగంగా వచ్చే వాహనాలతో తరుచూ ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో మంత్రి హరీశ్రావు 3 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషిచేశారు. అధికారుల వెంటపడి వేగంగా పనులు పూర్తి చేయించారు. పనులు పూర్తి కావడంతో త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సిద్ధ్దం చేస్తున్నారు.