మెదక్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య ఘట్టం పూర్తయింది. శుక్రవారంతో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ 10వ తేదీతో ముగిసింది. దీంతో మెదక్ నియోజకవర్గంలో 18 మంది అభ్యర్థులు.. 29 నామినేషన్ల సెట్స్ను వేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 16 మంది అభ్యర్థులు, 29 నామినేషన్ల సెట్లను దాఖలు చేశారు. మెదక్ నియోజకవర్గంలో శుక్రవారం చివరి రోజు 13 మంది అభ్యర్ధులు 14 నామినేషన్ల పత్రాలను దాఖలు చేశారు. ఇందులో అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ పార్టీ నుంచి ఒక నామినేషన్ దాఖలు కాగా, బీజేపీ నుంచి ఒక నామినేషన్, ఇండిపెండెంట్లుగా మైనంపల్లి వాణి, లస్మగల్ల పద్మ, ప్రభు, స్వామి, రంగాగౌడ్, తా ర్యాలు నామినేషన్లు వేశా రు. కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను మైనంపల్లి రోహిత్ దాఖలు చేశారు. బిఎస్పీ నుంచి లక్ష్మీ నామినేషన్ వేయగా, మార్కిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఒక నామినేషన్, యుగ తులసి పార్టీ నుంచి చింతల నర్సిం హులు, ఇండియన్ బిలివర్స్ పార్టీ నుంచి ఒక నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
అలాగే నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 11 మంది అభ్యర్ధులు 14 నామినేషన్లను దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వాకిటి సునీతారెడ్డి రెండు సెట్ల నామినేషన్లు వేయగా, బీజేపీ నుంచి మురళీధర్యాదవ్ రెండు సెట్ల నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవుల రాజిరెడ్డి నామినేషన్ వేయగా, బిఎస్పీ నుంచి నర్సింలు రెండు సెట్ల నామినేషన్లు వేశారు. యుగ తులసీ పార్టీ నుంచి నవీన్కుమార్ నామినేషన్ వేయగా, ఇండిపెండెంట్లుగా గాలి అనిల్కుమార్, మాధవి, లక్ష్మీ, లుకావత్ రమేశ్, లక్ష్మీలు నామినేషన్లు వేశారు. భారతీయ చైతన్య యువజన పార్టీ నుంచి ఆగమయ్య నామినేషన్ వేశారు. మధ్యా హ్నం 3 గంటలలోపు ఆర్వో ఆఫీస్లో ఉన్నవారికి మాత్రమే నామినేషన్ దాఖలుకు అవకాశం ఇచ్చారు. ముందు జాగ్రత్తగా ఒకో అభ్యర్థి రెం డు, మూడు సెట్లు దాఖలు చేశారు. తనతో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్తో సైతం నామినేషన్లు వేయించారు అభ్యర్ధులు. నామినేషన్కు ఆఖరి తేదీ కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు.
ఈ నెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలనను అధికారులు చేపట్టనున్నారు. అలాగే ఈ నెల 15న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అదేరోజు మూడు గంటల వరకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను అధికారులు ప్రకటించనున్నారు. ఈ నెల 30న పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.