మెదక్ : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవానీ మాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ముందుగా మంజీరా నదిలోని వివిధ ప్రాంతాల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఏడుపాయల ఆలయ ఈవో సార శ్రీనివాస్ తగిన ఏర్పాట్లు చేశారు.