జీడిమెట్ల, మార్చి 2 : గుర్తు తెలియని ఓ వ్యక్తి మృత దేహం కొంపల్లిలో లభ్యమైంది. ఈ సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొంపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో సుమారు 50 సంవత్సరాలు ఉన్న ఓ వ్యక్తి మృత దేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవఖానాకు తరలించారు. వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ మొబైల్ నంబర్ 8332981115 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.