రామాయంపేట/ పెద్దశంకరంపేట/ చిన్నశంకరంపేట/ మెదక్ మున్సిపాలిటీ, మార్చి 10 : రామాయంపేట పట్టణంలో సావిత్రీబాయిఫూలే 126వ వర్ధంతిని శుక్రవారం ప్రజా సంఘాల నాయకులు నిర్వహించారు. పోలీస్స్టేషన్ పక్కనే ఉన్న సావిత్రీబాయిఫూలే విగ్రహానికి జ్యోతిబాఫూలే సంఘం జిల్లా అధ్యక్షురాలు పోచమ్మల అశ్విని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సావిత్రీ బాయిఫూలే మహిళలకు ఆదర్శమన్నారు. దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రీబాయిఫూలే తన జీవి తాన్ని మహిళల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. మహిళల హక్కుల కోసం పోరాడిన వీరవనిత అన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాతూరి రాజు, లద్ద నర్సింహులు, వినయ్సాగర్, మహేశ్బాబు, నరేశ్, శ్రీనివాస్, దామోదర్, చింతల శేఖర్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మహిళల విద్యాభివృద్ధికి ఫూలే కృషి
పెద్దశంకరంపేట పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో సావిత్రీబాయి ఫూలే 126వ వర్ధంతిని దళిత సంఘాల నాయకులు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. మహిళల విద్యాభివృద్ధి కి ఎన్నో పాఠశాలలను ప్రారంభించి, మ హిళలకు అభ్యున్నతికి కృషి చేశారని అని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు దుర్గయ్య, ల క్ష్మయ్య, అర్జున్, నాగరాజు, బాలరాజు, సురేశ్, శ్రావణ్, బాలయ్య, వినేశ్ తదితరులు ఉన్నారు.
ఫూలే ఆశయాలను సాధించాలి
చిన్నశంకరంపేటలోని కస్తూర్బా పాఠశాలలో సావిత్రీబాయిఫూలే వర్ధంతి నిర్వహించారు. సావిత్రీబాయిఫూలే ఆశయ సా ధన కోసం ప్రతి ఒక్కనూ కృషి చేయాలని వివిధ పార్టీల నాయకులు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గీత, పీఏసీఎస్ మాజీ చైర్మన్ గోపాల్రెడ్డి, నాయకులు దుర్గపతి, మురళిమాదిగ పాల్గొన్నారు.
డిగ్రీ కళాశాలలో సావిత్రీబాయి పూలే వర్దంతి
మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సావిత్రీబాయి ఫూలే వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గణపతి, అధ్యాపకులు వేణు, మురళి, కిరణ్, సుధారాణి, శరత్రెడ్డి, తిరుమల్రెడ్డి పాల్గొన్నారు.