రామాయంపేట, ఆగస్టు 4: సీఎం కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శమని, త్వరలోనే రామాయంపేట రెవెన్యూ డివిజన్ ప్రక్రియ వెలువడుతుందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ క్యాం పు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. దేశంలో ఎక్కడా అమల్లో లేని పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పంట రుణమాఫీ, బీడీ టేకేదార్లకు ఆసరా పింఛన్లు ప్రవేశపెట్టిన అపర భగీరథుడు కేసీఆరేనని అన్నారు.
త్వరలోనే రామాయంపేట రెవెన్యు డివిజన్ ప్రక్రియను సీఎం ప్రకటించబోతున్నారని తెలిపారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సభ దృష్టికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లా డుతూ మెదక్ను జిల్లా కేంద్రంతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. రామాయంపేట ప్రజల కోరిక మేరకు అక్కడి మండలాలతో కలిపి నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని సభ దృష్టికి తీసుకొచ్చారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తా వించిన విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని సంబంధిత శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. డివిజన్ ప్రస్తావన తెచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పేట పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పుట్టి యాదగిరి, మాజీ మార్కెట్ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, బీఆర్ఎస్ మండల పట్టణాధ్యక్షుడు మహేందర్రెడ్డి, గజవాడ నాగరాజు, కౌన్సిలర్లు దేమె యాదగిరి తదితరులు ఉన్నారు.