దళారులను నమ్మి మోసపోవద్దు
ఎంపీపీలు, పీఏసీఎస్ చైర్మన్లు, అధికారులు
పల్లెల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
శివ్వంపేట/ రామాయంపేట రూరల్/ మనోహరాబాద్/ వెల్దుర్తి/ అల్ల్లాదుర్గం, మే 6 : యాసంగిలో పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడానికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి అన్నారు. శివ్వంపేట మండలంలోని పిల్లుట్ల, లింగోజిగూడ, రూప్లతండా, కొత్తపేట, రత్నాపూర్ గ్రామాల్లో శుక్రవారం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు ధాన్యం ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. చండి గ్రామంలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని ఏవో రమాదేవి, తహశీల్దార్ శ్రీనివాస్చారి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో వైస్ ఎంపీపీ రమాకాంత్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, సర్పంచ్లు బొగ్గుల సాలమ్మ, మెగావత్ రవి, నేతలు బం డారి గంగాధర్, చింత స్వామి, వీరస్వామి, వీరారెడ్డి, కల్లూరి వెంకటేశ్, వెంకటేశ్, ముత్యంరెడ్డి, ఏఈవో మౌనిక ఉన్నారు.
పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తాం..
రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామని రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం పేర్కొన్నారు. రామాయంపేట మండలంలోని ఢి.ధర్మా రం, సుతారిపల్లి, శివాయిపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు ఆందోళన చెందవద్దని, ధాన్యం ద ళారులకు విక్రయించకుండా ప్రభుత్వ కొ నుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు బొడ్డు శంకర్, రాగి సంధ్య, ఆర్కే మల్లేశం, సొసైటీ సీఈ వో పుట్టి నర్సింహులు పాల్గొన్నారు.
ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు
ధాన్యం కొనుగోళ్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి అన్నారు. మనోహరాబాద్, తూప్రాన్ మండలాల్లో కొ నుగోలు కేంద్రాలను పరిశీలించి, ధాన్యాన్ని బస్తాల్లో నింపించి, లారీల్లో లోడ్ చేయించారు. కేంద్రాల్లో కూలీల కొరత లేకుండా ఇతర రాష్ర్టాల నుంచి కూలీలను రప్పించామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్రెడ్డి, మండల అధ్యక్షుడు భగవాన్రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీహరి, పీఏసీఎస్ డైరెక్టర్ జావిద్పాషా, నాయకులు రాహుల్రెడ్డి, నాయకుడు చంద్రశేఖర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి : ఎంపీపీ స్వరూప
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని ఎంపీపీ స్వరూప అన్నా రు. వెల్దుర్తి మండలంలోని పంచాయతీ శేరీల, మాసాయిపేట మండలంలోని హక్కీంపేట, బొమ్మారం గ్రామాల్లో ఐకేపీ కేం ద్రాలను తహసీల్దార్ సురేశ్కుమార్, సర్పంచ్ భాగ్యమ్మ, ఎంపీటీసీ మోహన్రెడి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జగదీశ్వరాచారీ, ఏపీఎం శంకరయ్య, సర్పంచ్లు విఠల్, శం కర్, ఎంపీటీసీలు నవనీత, సోనీశ్రీనునాయక్, ఆర్ఐ ధన్సింగ్తోపాటు స్థానిక నాయకుడు నరేందర్రెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ కేంద్రాల్లో మద్దతు ధర : మాజీ ఎంపీపీ కాశీనాథ్
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని మాజీ ఎంపీపీ కాశీనాథ్ అన్నా రు. అల్లాదుర్గం మండలం రెడ్డిపల్లిలో పీఏసీఎస్ కొనుగోలు కేం ద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ ధాన్యానికి రూ,1960, బీ గ్రేడ్ ధాన్యానికి రూ,1940 మద్దతు ధర లభిస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు దుర్గారెడ్డి, నర్సింహులు, రవీందర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.