నిజాంపేట, ఫిబ్రవరి 6 : సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలకు అడ్డుకట్ట పడుతుందని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. మండలంలోని నగరం గ్రామంలో స్థానికుడు నరేందర్రెడ్డి అందజేసిన రూ.1.36 లక్షల విరాళంతో 8 సీసీ కెమెరాలు, చల్మెడలో ప్రజాప్రతినిధులు, కుల సంఘాలు, ఉద్యోగులు, వ్యాపారులు అందజేసిన రూ. 5.14 లక్షల వి రాళాలతో ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను సోమవారం ఎస్పీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎటువంటి ప్రమాదాలు జరుగవన్నారు. నెల రోజుల వ్యవధిలో మె దక్ జిల్లాలో దాదాపుగా 30 మంది మృతి చెందారని తెలిపారు. నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. బైక్ను నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలతోపాటు ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సై శ్రీనివాస్రెడ్డిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ యాదగిరిరెడ్డి, సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై శ్రీనివాస్రెడ్డి, ఎం పీపీ సిద్ధిరాములు, సర్పంచ్ నర్సింహరెడ్డి, ఎంపీటీసీ బాల్రెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్, తిరుమల ఆలయ కమిటీ చైర్మన్ మహేశ్, వార్డు సభ్యులు, కార్యదర్శి నర్సింహరెడ్డి ఉన్నారు.