పాపన్నపేట, మే12 : జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తలింగాయపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై విజయ్కుమార్ సమాచారం మేరకు.. కొత్తలింగాయపల్లి గ్రామానికి చెందిన గొల్లరాజు(25) కూలీ పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసగా మారాడు. మద్యం మత్తులో తరుచూ భార్య మల్లమ్మతో గొడవపడేవాడు.
దీంతో జీవితంపై విరక్తి చెంది గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లి చీకోడ్ గ్రామ శివారులో స్మశాన వాటిక సమీపంలో ఉన్న ఓ చెట్టుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్కుమార్ వివరించారు.