బెజ్జంకి, మార్చి 31: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన ప్రమోద్రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు యూకేలో మెరిసింది. సుహానీరావు మిస్ టీన్ గెలాక్సీ పేజెంట్ యూకే టైటిల్ను గెలిచి మొదటి దక్షిణాసియా వాసిగా నిలిచింది. దీంతో అమెరికాలో జరిగే గెలాక్సీ ఇంటర్నేషనల్ పోటీల్లో యూకే తరపున ఆమె ప్రాతినిధ్యం వహించనున్నది. ఈ నెలలో యూకేలోని వారింగ్టన్లోని పార్ హాల్ లో యునైటెడ్ కింగ్డమ్ నలుమూలల నుంచి 25 మంది యువతుల ఫైనలిస్టులతో పోటీపడి టైటిల్ సాధించింది. ప్రమోద్రావు, సరిత కుటుంబం 14 ఏండ్ల క్రితం యూకే వెళ్లి బకింగ్హామ్షైర్లో స్థిరపడింది.
భరత నాట్యంలో డిప్లొమా చేసిన సుహానీరావు నృత్యకారిణిగా స్థానికంగా మంచిపేరు పొంది నాట్య కళాజ్యోతి బిరుదు పొందింది. బీజ్ క్లీన్ప్, బయోడిగ్రేడబుల్ ప్యాడ్ డొనేషన్ క్యాంపెన్ వంటి కార్యక్రమాలు నిర్వహించి పేదరికాన్ని నిర్మూలించడం లక్ష్యంగా పనిచేస్తున్నది. ఆగస్టులో యూఎస్ఏలోని ఫ్ల్లొరిడాలోని ఓర్లాండోలో జరిగే గెలాక్సీ ఇంటర్నేషనల్ పేజెంట్లో యూకే తరుఫున ఆమె ప్రాతినిధ్యం వహించనున్నది. అంతర్జాతీయ కిరీటం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతులతో పోటీ పడనున్నది. తోటపల్లికి చెందిన యువతి యూకేలో ఉత్తమ ప్రతిభ కనబర్చి టైటిల్ సాధించడంపై గ్రామంతో పాటు మండలవాసులు అభినందిస్తున్నారు.