రామాయంపేట/ హవేళీఘనపూర్/ చిలిపిచెడ్/ టేక్మాల్/ పాపన్నపేట, నవంబర్ 22 : రామాయంపేట మండలవ్యా ప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో ప్రతిభను కనబర్చిన 8, 9, 10 తరగతుల విద్యార్థులకు రామాయంపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బహుమతులు అందజే శారు. మండలస్థాయిలో 16మంది ఎంపిక కాగా, జిల్లాస్థాయి చెకుముఖి పోటీలకు ముగ్గురు విద్యార్థులు (మోడల్ స్కూల్) ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షుడు నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. జిల్లాస్థాయి చెకుముఖి పోటీల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. విద్యా ర్థుల్లో శాస్త్రీయ అలోచనలు రావాలని సూచించారు. విద్యా ర్థులు నిశిత పరిశీలన, ప్రయోగాలపై ఆసక్తిని పెంపొందించు కోవాలన్నారు. సైన్స్ అభివృద్ధితోనే దేశాభివృద్ధి ఆధారపడింద న్నారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక బాధ్యులు రాజేందర్, లక్ష్మణ్, శంశోద్దీన్, రసీద్, సతీశ్ పాల్గొన్నారు.
కూచన్పల్లిలో సైన్స్ పోటీలు
హవేళీఘనపూర్ మండలంలోని కూచన్పల్లి జడ్పీ స్కూల్ లో మండలస్థాయి చెక్ముఖీ పోటీలు నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దృక్పథం అలవర్చేందుకు చెకుముఖి పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న మంత్రాలు, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మండలస్థాయిలో నిర్వహించిన పరీక్షలో బూర్గుపల్లి జడ్పీ స్కూల్ విద్యార్థులు ప్రణయ, పీర్సింగ్, అక్షయ, తెలుగు మీడియంలో సర్దన విద్యార్థులు ఈశ్వరి, నాని, సంజయ్కుమార్, వెంకటలక్ష్మి, మొదటి స్థానం సాధించినట్లు తెలిపారు.
బహుమతులు, ప్రశాంస పత్రాల అందజేత
విద్యార్థుల్లో సైన్స్పై అభిరుచి పెంపొందించడానికి చెకుముఖీ పరీక్ష నిర్వహించినట్లు చెకుముఖి కోఆర్డినేటర్ ఆదినారాయణ తెలిపారు. చిలిపిచెడ్ ఉన్నత పాఠశా లలో సైన్స్ పరీక్ష నిర్వహించారు. తెలుగు మాధ్యమం నుంచి చిట్కుల్, చిలిపిచెడ్, చండూర్ పాఠశాలల విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. ఆంగ్ల మాధ్యమం నుంచి ఫైజాబాద్ విద్యా ర్థి ఎంపికైనట్లు ఉపాధ్యాయుడు రమేశ్ తెలిపారు. విద్యార్థులు శాస్త్రీయ ధృక్పథం, ప్రశ్నించే తత్వం పెంపొందించాలని సూ చించారు. విజేతలు నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్ర శాంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో టీచర్లు చంద ర్, గంగాధర్రావు, శ్యామ్సుందర్, శంకర్, ప్రవీణ్ ఉన్నారు.
సత్తా చాటిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు
టేక్మాల్లో జరిగిన మండలస్థాయి చెకుముఖి పరీక్షల్లో ఆద ర్శ పాఠశాల విద్యార్థులు ఉమ, శ్రీవేణి, గజేంద్రుల సూర్యవర్ధన్ మండలస్థాయి విజేతలుగా నిలిచారు. వీరు జిల్లాస్థాయి పరీక్షలో పాల్గొంటారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయు డు కరుణాకర్రెడ్డి, ‘చెకుముఖి’ కోఆర్డినేటర్ శ్రీధర్ ఉన్నారు.
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెరగాలి
సైన్స్తో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథంలోపాటు పరిశీలన నైపుణ్యం పెరుగుతుందని పాపన్నపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరీసింగ్, సైన్స్ ఉపాధ్యాయుడు రమేశ్ చౌదరి పేర్కొన్నారు. పాపన్నపేటలో చెకుముఖి పరీక్ష నిర్వహించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాపన్నపేట, యూసూఫ్పేట, పొడ్చన్పల్లి, నా గసాన్పల్లి, కొడపాక, చీకోడ్, లింగాయపల్లి, కుర్తివాడ, కేజీ బీవీ పాఠశాలల విద్యార్థులు పరీక్ష రాశారు. తెలుగులో నాగసాన్పల్లి, పాపన్నపేట, ఇంగిష్ మీడియంలో పాపన్నపేట, యూసూఫ్పేట పాఠశాలల విద్యార్థులు జిల్లాస్థాయికి ఎంపికయ్యారు. కార్యక్రమంలో టీచర్లు బాలనర్సయ్య, నర్సింహు లు, వేణుగోపాల్రెడ్డి, నాగరాజు, శశికుమార్రెడ్డి, బి.వేణుగోపాల్, లోక్యనాయక్, రవీందర్, వెంకటేశం ఉన్నారు.