హుస్నాబాద్, డిసెంబర్ 26: పెట్టుబడిదారి వ్యవస్థ నిర్మూలనకు సీపీఐ పోరాటం చేస్తున్నదని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం హుస్నాబాద్లోని అనభేరి సింగిరెడ్డి స్మారక భవనంలో సీపీఐ 98వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా త్యాగాలకు సైతం సిద్ధమై ఉద్యమించిన ఘనత సీపీఐ పార్టీకే చెందుతుందన్నారు.
కేంద్రం కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ పేద, మధ్య తరగతి కుటుంబాలపై పెనుభారం మోపుతున్నదని, కేంద్రం వైఖరిని ప్రతి ఒక్కరూ ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, నాయకులు జాగీరు సత్యనారాయణ, వనేశ్, సంజీవరెడ్డి, సుదర్శనాచారి, కొమురయ్య, గూడ పద్మ, రాజ్కుమార్, స్వాతి, ఎల్లయ్య, మల్లారెడ్డి, బాలయ్య, కుమారస్వామి, భాస్కరాచారి, కనకస్వామి, కిష్టయ్య, నవ్య, నిర్మల, శోభ పాల్గొన్నారు.