మెదక్ రూరల్, మే10: ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది న ఎరువుల దుకాణాల్లో నకిలీ విత్తనాలతో పాటు ఎరువులను అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు దుకాణాలను సీజ్ చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాం నాయక్ అన్నారు. మంగళవారం వ్యవసాయ, పోలీస్శాఖ ఆధ్వర్యంలో మెదక్ మండల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆత్మకమిటీ చైర్మన్ అంజాగౌడ్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాం నాయక్, మండల రైతు సమన్వయ అధ్యక్షుడు కిష్టయ్య హాజర య్యారు. అనంతరం వారు మాట్లాడు తూ విత్తనాలు అమ్మే ప్రతి దుకాణం విత్తన లైసెన్స్ కనపడే విధంగా ప్రదర్శించాలన్నారు.
స్టాక్ వివరాలను ఎప్పటికప్పడు సరి చేయాలన్నారు. విత్తనాలు తీసుకున్న రైతుకు బిల్లు తప్ప నిసరిగా ఇవ్వలన్నా రు. కాలం చెల్లిన విత్తనాలను ఎట్టి పరిస్థితిలో అమ్మకూడదన్నారు. విత్తన చట్టం ప్రకారం అన్ని నియమనిబంధనలు పాటించాలని, లేకపోతే సిడ్ కంట్రోల్ ఆర్డర్ 1983 ప్రకారం చర్యలు తీసుకుంటమన్నారు. కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు విజయనిర్మల, ఎస్ఐ మల్లరెడ్డి, మండ ల వ్యవసాయాధికారి శ్రీనివాస్, ఏఈవో శేఖర్, డీలర్లు శ్రీనివాస్, రాజునారాయణ్ ఉన్నారు.
చట్టపరమైన చర్యలు..
చిన్నశంకరంపేట, మే10: కల్తీ విత్తనాలను, మందులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏడీఏ విజయనిర్మల తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని గవ్వలపల్లి రైతువేదిక కార్యాలయంలో ఎరువుల దుకాణం యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏడిఏ విజయనిర్మల మాట్లాడుతూ వానకాలం సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని సూచించారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, మందులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలన్నారు.
రైతులు ఎరువులు కొనేటప్పుడు తప్పనిసరిగా ఆధార్కార్డును తీసుకురావాలని సూచించారు. విత్తనాలను ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎరువుల దుకాణాల ముందు స్టాక్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో మండల రైతుబంధు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఎస్సై సుభాశ్గౌడ్, మండల వ్యవసాయాధికారి లక్ష్మీప్రవీణ్, సింగిల్విండో చైర్మన్ అంజిరెడ్డి, ఏకే యాదవరావు వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీనివాస్, మౌనిక, శ్యాంకుమార్, యజమానులు పాల్గొన్నారు.