గజ్వేల్అర్బన్, జనవరి 10: నాలుగు రోజుల పాటు జరుగనున్న రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు గజ్వేల్ పట్టణం ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు క్రీడాపోటీలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 1000 మంది క్రీడాకారులు, మరో 200 మంది రాష్ట్ర, వివిధ జిల్లాలకు చెందిన రాష్ట్ర స్థాయి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొననున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్సీ సంతోష్, ప్రధాన కార్యదర్శి శివకుమార్ తెలిపారు. స్థానిక మైదానంలో నిర్వహించనున్న ఈ క్రీడల నిర్వహణకు 4 సింథటిక్ మ్యాట్లతో కూడిన కబడ్డీ కోర్టులు, ఎడ్యుకేషన్ హబ్లో క్రీడాకారులకు వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.