మెదక్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో సమాచార హకు చట్టం పటిష్టంగా అమలు చేయడంలో కలెక్టర్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి కితాబిచ్చారు. మంగళవారం సమాచార హకు చట్టం కమిషనర్ల పర్యటన నేపథ్యంలో మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో పౌర సమాచార అధికారులతో ఆర్టిఐయాక్ట్ అమలు చేయు విధివిధానాలపై క్షుణ్ణంగా పౌర సమాచార అధికారులకు చట్ట నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
మెదక్ జిల్లాకు చేరుకున్న రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఇతర కమిషనర్లు, పీవీ శ్రీనివాస్ , బోరెడ్డి అయోధ్యరెడ్డి, మోసిన్ పర్వీన్, వైష్ణవి మేర్ల, దేశాల భూపాల్కు జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ పూల బొకేలతో స్వాగతం పలికారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ గౌరవ వందన స్వీకరించి, వనమహోత్సవంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యం మొకలు నాటారు. ప్రజావాణిహాల్లో పౌర సమాచార అధికారుల అవగాహన సదస్సుకు ఇతర కమిషనర్లతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిఐ కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టి మొదటిగా మెదక్ జిల్లాకు రావడం జరిగిందని, సమాచార హకు చట్టం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్,అధికారులు చూపించిన చొరవ హర్షించదగ్గ విషయమన్నారు. మెదక్ జిల్లాలో ఆర్టిఐ యాక్ట్ సమర్థవంతంగా అమలవుతుందన్నారు.
సమాచార హకు చట్టంపై పౌర సమాచార అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సమాచార హకు చట్టం అమలులోకి వచ్చిందని తెలిపారు. సెక్షన్లు, సబ్ సెక్షన్లపై క్షుణ్ణంగా చదివి పౌర సమాచార అధికారులు సమగ్ర అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న 29 ప్రభుత్వ శాఖల్లో 15 శాఖల్లో కేసులు లేకపోవడం హర్షించదగ్గ విషయమన్నారు. 136 దేశాల్లో ఆర్టిఐయాక్ట్ అమలులో ఉందన్నారు.
గత పది పదేండ్లలో సమాచార కమిషన్ అందుబాటులో లేకపోవడం వల్ల రాష్ట్రంలో 18 వేల కేసులు సమాచార హకు చట్టం కమిషన్ దగ్గర పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రజలు సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సమాచారం అందజేయాలని, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల వద్ద సిటిజన్ షాట్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.సహేతుక కారణాలు చూపించకుండా ఆర్టిఐ యాక్ట్ దరఖాస్తులను తిరసరించకూడదని సూచించారు. సమాచార హకు చట్టం అందుబాటులో ఉంది కాబట్టి అందరూ బాధ్యతగా తీసుకొని వీలైనంత తొందరగా సమాచారం ప్రజలకు అందించాలన్నారు.
వచ్చేనెలలో పెండింగ్లో ఉన్న కేసులను పూర్తిగా పరిషరించి కొత్త దరఖాస్తుల ద్వారా ముందుకు వెళ్లబోతున్నామని చెప్పారు. రెండు నెలల్లో 30 శాఖల కేసులను పూర్తిగా పరిషరించి జీరో కేసులు ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. 11 జిల్లాలను ఎంపిక చేసుకుని సమాచార హకు చట్టం ద్వారా పౌర సమాచార అధికారులకు అవగాహన పెంపొందించి చట్టంలోని సెక్షన్లు, పూర్తిగా వివరిస్తున్నామన్నారు. అందరికీ సమాచారం అందించేందుకు అధికారులు ముందుకు రావాలన్నారు.
22 జిల్లాల్లో 17 శాఖలు వచ్చే మార్చి లోపు అన్ని కేసులకు పరిషార మార్గాలు చూపి సమాచారం అందించే విధంగా చూస్తామన్నారు. మరుగున పడిన వ్యవస్థను నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకువచ్చి ప్రజలకు జవాబు దారి తనం పెంచడంలో అవగాహన సదస్సు ఎంతో ఉపయోగపడుతుందనారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో సమాచార హకు చట్టాన్ని పటిష్టంగా అమలయ్యే విధంగా అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
పూర్తి నిబంధనలు అనుసరిస్తూ ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సమాచారం కావాలంటే నిబంధనలకు లోబడి సమాచారం అందించే విధంగా ఆదేశాలు జారీ చేస్తున్నామని వివరించారు. మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీవోలు మెదక్ రమాదేవి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, తూఫ్రాన్ జయచంద్రారెడ్డి, జిల్లాలోని వివిధ శాఖల పౌర సమాచార అధికారులు, పోలీస్ యంత్రా ంగం, సిబ్బంది పాల్గొన్నారు.