హుస్నాబాద్, మే 23 : హుస్నాబాద్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఘటం కుండ ప్రవేశంతో పాటు ప్రత్యేక పూజలు అమ్మవారికి బాసికాలు కట్టి కల్యాణోత్సవం జరిపించడం ద్వారా జాతర ప్రారంభమైంది. అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఉత్సవాలు జరుగగా, బైండ్ల పూజారుల ఆధ్వర్యంలో వేసిన పెద్దపట్నం, మత్తకొలుపు, అమ్మవారి జీవిత చరిత్ర కథ విశేషంగా ఆకట్టుకున్నాయి. బైండ్ల పూజారుల విన్యాసాలు, గావుపట్టే కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య జరిగాయి. మహిళలు బోనాలతో వచ్చి అమ్మవారికి సమర్పించారు. మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, కమిషనర్ మల్లికార్జున్ అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. సాయంత్రం బండ్లు తిరిగేకార్యక్రమం నిర్వహించారు. అధిక సం ఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ పూదరి లక్ష్మీనారాయణ, ఈవో కిషన్రావుతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు కొంకటి నళినిదేవి, బోజు రమాదేవి, వాల సుప్రజ, గోవిందు రవి, పెరుక భాగ్యరెడ్డి, బొల్లి కల్పన, పున్న లావణ్య, చిత్తారి పద్మ, స్వర్ణలత, ఆలయ అర్చకుడు పరమేశ్వరశర్మ, కమి టీ సభ్యులు, ఆలయ సిబ్బంది కుమారస్వామి, రమేశ్, హన్మంతు, గౌడ సంఘం నాయకులు పచ్చిమట్ల రవీందర్గౌడ్, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నెల రోజుల పాటు జాతర ఉత్సవాలు కొనసాగనున్నాయి.