సంగారెడ్డి, మార్చి 27: సంగారెడ్డిలోని రామ్మందిర్లో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి పర్యవేక్షణలో, జ్యోతిర్వాసు విద్యాపీఠం పీఠాధిపతి మహేశ్వరశర్మ సిద్ధ్దాంతి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన కుటుంబీకులతో కలిసి రామ్నగర్లోని తన ఇంటి నుంచి రామ్మందిర్ వరకు భజనలు, డప్పుచప్పుళ్లతో రూ. 2.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, పది కిలోల వెండితో ఆదిశేషుడు, వెండి కల్యాణ పీట తీసుకెళ్లి బహూకరించారు. జగ్గారెడ్డి బహూకరించిన ఆభరణాలను పురోహితులు సీతారాముల విగ్రహాలకు అలంకరించారు.