మెదక్ మున్సిపాలిటీ, మార్చి 29: జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు శుక్రవారం భక్తి శ్రద్ధలతో గుడ్ ‘ఫ్రై డే’ నిర్వహించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో గుడ్ఫ్రైడే సందర్భంగా వేలాది మంది భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం శిలువను ఊరేగించిన మధ్యాహ్నం వరకు ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు. లోక పాపములను పోగొట్టుటకు శిలువ ఎక్కాడు. చర్చి ప్రేసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ శాంతయ్య దైవసందేశం వినిపించారు.
గుడ్ ఫ్రై డే సందర్భంగా ఏసయ్య భక్తి గీతాలు ఆలపించారు. మెదక్ డయాసిస్ పరిధిలోని పలు జిల్లాల నుంచి క్రైస్తవులు భారీగా తరలిరావడంతో చర్చి ప్రాంతం కిటకిటలాడింది. ప్రార్థనల్లో పాస్టర్లు డేవిడ్, శ్రీనివాస్, సువర్ణ, జైపాల్, సంఘ పెద్దలు గంట సంపత్, జాన్సన్, సంశాన్ సందీప్, గెలెన్ చిత్తరంజన్, సునీల్, సువన్డగ్లస్, జాయ్ముర్రే తదితరులు పాల్గొన్నారు.
చేగుంట, మార్చి 29: చేగుంట, నార్సింగి మండలాల్లోని చర్చిల్లో గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వడియారంలో ఉన్న సీఎస్ఐలో పాస్టర్ రేవ విజయకుమార్, రవీంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
నిజాంపేట, మార్చి 29: మండల వ్యాప్తంగా చర్చిలలో శుక్రవారం పాస్టర్లు, క్రైస్తవులు గుడ్ ప్రై డే వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. నిజాంపేటలోని చర్చిలో పాస్టర్ క్రాంతిరాజు క్రైస్తవులకు క్రీస్తు శాంతి సందేశాన్ని వినిపించారు. చర్చి ప్రాంగణమంతా యేసుక్రీస్తు పాటలతో మార్మోగింది.