రామచంద్రాపురం, డిసెంబర్ 6: సినీతార శ్రీలీల శుక్రవారం ఆర్సీపురంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సందడి చేసింది. ఆర్సీపురంలోని జాతీయ రహదారిని ఆనుకొని నూతనంగా ఏర్పాటు చేసిన 37వ సౌత్ ఇండియా షాపింగ్మాల్ను ఆమె ప్రారంభించింది. సౌత్ ఇండియా షాపింగ్మాల్ సంస్థ యజమానులు వెంకటేశ్వర్లు, రాజమౌళి, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షాపింగ్మాల్ ప్రారంభోత్సవం అనంతరం సినీతార శ్రీలీల షాపింగ్ మాల్లో కలియతిరిగి ఫస్ట్, సెకండ్ తదితర ఫ్లోర్లను సందర్శించారు. గ్రౌండ్ ఫ్లోర్లోని సారీ కౌంటర్ వద్దకు వచ్చి చీరలను మీడియా ముందు ఆవిష్కరించారు.
సంస్థ డైరెక్టర్లు సురేశ్ సీర్ణ, అభినయ్, రాకేశ్, కేశవ్ కస్టమర్లకు స్వాగతం పలికారు. సంస్థ డైరెక్టర్ సురేశ్ మాట్లాడుతూ.. బీహెచ్ఈఎల్, రామచంద్రాపురం వాసులు కోరుకునే నాణ్యతకు, నవ్యత్వానికి పెద్దపీట వేస్తూ వస్ర్తాలను అందుబాటులో ఉంచామన్నారు. సంస్థ డైరెక్టర్ అభినయ్ మాట్లాడుతూ.. పర్వదినాలకు, భారతీయ సంప్రదాయ కలెక్షన్లకు తమ షోరూమ్ కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు. సంస్థ డైరెక్టర్ రాకేశ్ మాట్లాడుతూ.. తమ షోరూమ్ అన్నిరకాల వస్ర్తాలకు ధరల్లోనూ, నాణ్యతలోనూ వస్త్రప్రియుల అభిరుచులను ప్రతిబింబిస్తుందని తెలిపారు. సంస్థ డైరెక్టర్ కేశవ్ మాట్లాడుతూ.. వైవిధ్యభరితమైన వస్ర్తాలను కోరుకునే కొనుగోలుదారులకు ప్రతి వెరైటీని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
సినీతార శ్రీలీల మాట్లాడుతూ.. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 37వ బ్రాంచ్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సౌత్ ఇండియా మాల్స్ ప్యాన్ ఇండియాకి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. సౌత్ ఇండియాలో సరసమైన ధరలకే వినియోగదారులు షాపిం గ్ చేయవచ్చని, పండుగలు, శుభకార్యాలకు సౌత్ ఇండియాలోనే షాపింగ్ చేయాలని కోరారు. అక్కడి నుంచి శ్రీలీల మాల్ బయట ఏర్పాటు చేసిన స్టేజీ వద్దకు వచ్చి అభిమానులతో మాట్లాడి వారిలో జోష్ నింపారు. అభిమానులను ఉత్సాహపరుస్తూ మాట్లాడారు. అందాల తారను వారి ఫోన్ల్లో బంధించేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. పలువురు ఆమెతో సెల్ఫీలు దిగారు. ఇన్స్పెక్టర్ జగన్నాథ్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు కల్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్పానగేశ్, ఎస్సై రామకృష్ణ పాల్గొన్నారు.