కౌడిపల్లి: మండలానికి కాళేశ్వర జలాలను తీసుకువచ్చి తాగు, సాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయబోతున్నామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని రూ.66లక్షలతో మహ్మద్నగర్, తునికి గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించారు. రూ.3కోట్ల 70లక్షలతో ఆయా గిరిజన తండాల్లో నిర్మించిన సీసీ రోడ్లు పనులను ప్రారంభించారు. మహ్మద్నగర్ కొత్తరోడ్డు వద్ద పీఏసీఎస్ భవనం, గోదాం నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రత్యేకంగా కలిసి కౌడిపల్లి ప్రాంతానికి కాళేశ్వరం నీళ్లు తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు.
మహ్మద్నగర్, కన్నారం గ్రామాల్లో పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు వేసేందుకు అధికారులు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో లేబర్ బోర్డ్ చైర్పర్సన్ ఉమ్మన్నగారి దేవేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జిల్లా వ్యవసాయాధికారి పరశురాం నాయక్, డీసీసీబీ ఉమ్మడి మెదక్ జిల్లా డైరెక్టర్ బాన్సువాడ గోవర్ధన్రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ మల్లారెడ్డి, ఎంపీపీ రాజు, జడ్పీటీసీ కవిత, మహ్మద్నగర్ సొసైటీ వైస్ చైర్మన్ చిలుముల చిన్న చిన్నంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సార రామాగౌడ్, మండల యూత్ అధ్యక్షుడు చంద్రం క్రిష్ణాగౌడ్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.