సంగారెడ్డి, మార్చి12: కృత్రిమ ఇసుక తయారీ కేంద్రంపై టాస్కఫోర్స్ పోలీసుల దాడులు చేసి అక్రమ ఫిల్టర్లను ధ్వంసం చేశారు. మంగళవారం మండల పరిధిలోని ఇస్మాయిల్ఖాన్పేట నక్కవాగులో ఒక ఇటాచీ, రెండు ట్రాక్టర్లతో మట్టిని తవ్వి ఇసుక తయారు చేస్తున్న నిర్వాహకుడు వెండికోల్ వీరేశం, మరో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అక్రమ ఇసుక తయారు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రూపేశ్ వెల్లడించారు.