రామాయంపేట, నవంబర్ 1 : ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు రామాయంపేటలో ఉ చితంగా ఫిజికల్ మేనేజ్మెంట్ శిక్షణను ఉచితంగా ఇస్తున్నట్లు సీఐ చం ద్రశేఖర్రెడ్డి తెలిపారు. రామాయంపేట ప్రభుత్వ కళాశాల మైదానంలో మంగళవారం ఉదయం 5 గంటల కు శిక్షణ కార్యక్రమాన్ని ప్రై వేట్ పీఈటీలతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం సీఐ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడు తూ.. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సహకారంతో అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 5 నుంచి 9గంటల వరకు ప్రభు త్వ కళాశాల మైదానంలో ఫిజికల్ మేనేజ్మెంట్పై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మెదక్ నియోజక వర్గం పరిధిలోని రామాయంపేట, చిన్నశంకరంపేట, చేగుంట, నిజాంపేట, నార్సింగి, చిన్నశంకరంపేట మండలాలకు సంబంధించిన అభ్యర్థులందరూ ఉచిత శిక్షణ కు హాజరుకావాలని కోరారు. నిపుణులైన ప్రైవేట్ పీఈటీలు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు రన్నింగ్, లాంగ్జంప్, హైజంప్, షాట్ఫుట్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తు న్నట్లు వివరించారు. అభ్యర్థులు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని పోలీసు ఉద్యోగాలను సా ధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్సై రాజేశ్, పీఈటీలు యాదగిరి, ప్రసాద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.