రామాయంపేట, సెప్టెంబర్ 18 : సీజనల్ వ్యా ధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండడమే గాకుండా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు కాలనీల్లో దోమలు వృద్ధి చెందకుండా రసాయనాలను పిచికారీ చేయాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ పేర్కొన్నా రు. ఆదివారం పట్టణంలోని వివిధ వార్డుల్లో పర్యటిం చారు. పట్టణంలోని మల్లెచెరువును పరిశీలించి, పారిశుధ్య కార్మకులు పలు సూచనలు, సలహాలుఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్ మాట్లాడుతూ.. రాబోయేది పండుగల సీజన్ అని, ప్రతి వీధిలోనూ పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. విద్యుత్ స్తంభాలకు బల్బులు లేకుంటే కొత్తవాటిని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి వీధి లో స్వచ్ఛతతోపాటు హరితహారం పనులను మున్సిపల్ సిబ్బంది నిరంతరం చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు చెత్తాచెదారం లేకుంటే శుభ్రం చేసుకోవాలని సూ చించారు. పట్టణంలోని గొల్పర్తి, కోమటిపల్లి, తండాల్లో ఫాగింగ్ యంత్రంతో దోమల నివారణ మందును పిచికారీ చేయిస్తామ న్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ యాదగిరి, కౌన్సిలర్లు యాదగిరి, గంగాధర్, నాయకులు కొండల్రెడ్డి, కిషన్, దేవుని రాజు, శ్యాంసుందర్, చింతల యాదగిరి, అనిల్ తదితరులు ఉన్నారు.