సిద్దిపేట, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేతితో నడిపిన నాటి ఉద్యమ రథసారథి, నేటి తెలంగాణ సీఎం కేసీఆర్. శాంతియుతంగా, గాంధేయ మార్గంలో పోరాడి రాష్ట్ర సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు జనాన్ని కదిలించి, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను సాధించిన ధీరుడు. ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేటలో ఫ్రీజోన్.. కాదురా.. హైదరాబాద్ మాదిరా.. పేరిట 14ఎఫ్కు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యోగ గర్జన.. నిరాహార దీక్షలు.. ఇలా ఎన్నో ఘట్టాలకు వేదికగా సిద్దిపేటను మా ర్చుకొని ఉద్యమాలు జరిగాయి. ఉద్యోగుల పక్షాన నిలబడి పోరాటం చేశారు. రాష్ట్రం లో ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ.. దేశం లో ఎక్కడా లేని విధంగా వేతనాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇవాళ దేశంలోని అన్ని రాష్ర్టాలకు తెలంగాణ రోల్మోడల్గా నిలిచింది.
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి దార్శనికుడి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అన్నివర్గాలకు అన్యాయం చేస్తున్నది. ఇవాళ ఏ ఒక్క వర్గం నరేంద్రమెడీ పాలనలో సంతృప్తిగా లేరు. నిరుద్యోగులు, ఉద్యోగు లు, రైతులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు దేశంలో ప్రత్యామ్నాయ నేత రావాలని బలంగా కోరుతున్నారు. నరేంద్రమోదీని ఎదుర్కొనే సత్తా సీఎం కేసీఆర్కు మాత్రమే ఉందని రిటైర్డ్ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు ముక్తకంఠంతో చెబుతున్నా రు. ప్రధాని మోదీ అమ్మకానికి మారుపేరుగా చెప్పవచ్చును. ప్రభు త్వ రంగం సంస్థలను అమ్మడానికి పెట్టారు. ఒక్కోక్కటిగా కేంద్ర ప్రభు త్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న ఎంతో మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యో గులు సంతోషంగా లేరు. తెలంగాణలో సమర్థవంతమైన పాలనను సీఎం కేసీఆర్ అందించడంతో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నా రు. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలనను అందిస్తున్నారు. ఇంతటి మహా నేత దేశం కోసం బయలు దేరాల్సిన అవసరం ఆసన్నమైంది. కేసీఆర్ వెంట తాము ఉంటాం. నాడు విద్యుత్ సమస్యలపైనే కేసీఆర్ పోరాటం చేసి ఆనాటి సమైక్య రాష్ర్టాల ముఖ్యమంత్రులను ఎదిరించి రైతుల పక్షాన పోరాటం చేశారు. ఇవాళ దేశంలోని వివిధ రాష్ర్టాల రైతుల కోసం మరోసారి పోరాటానికి సిద్ధమైన కేసీఆర్కు తామంతా అండగా ఉంటామని ముక్తకంఠంతో చెబుతున్నారు.
సంక్షేమ ఫలాలు దేశమంతటా అమలవుతాయి
కేసీఆర్ దేశరాజకీయాల్లోకొస్తే తెలంగాణలో తరహా సంక్షేమ పథకాలు దేశమంతటా అమలవుతాయి. దీంతో దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు పురోగతి సాధిస్తారు.గొప్ప రాజనీతిజ్ఞత కలిగిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం. ఆయన సేవలు దేశానికెంతో అవసరం. ప్రపంచ పటంలో భారత్ను అగ్రగామిగా నిలుపుతారనే నమ్మకం ఉన్నది.
-విద్యాసాగర్,రిటైర్డ్ ఎస్సై, తూప్రాన్
దేశ రాజకీయల్లో మార్పు వస్తుంది..
దేశంలో మార్పు కోసం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఎంతైన ఉన్నది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉదమ్యలు చేస్తున్న సమయంలో ఎంతో మంది మాటలతో అవమానించినప్పటికీ వారి మాటలు పట్టించుకోకుండా పట్టు వదలని విక్రమార్కుడిలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ మాదిరిగా భారతదేశం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ లాంటి విజన్ ఉన్న మంచి నాయకుడు దేశానికి అవసరం.
-గడ్డం జనార్దన్పూజారి,జహీరాబాద్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షుడు
చారిత్రక అవసరం..
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చారిత్రక అవసరంగా భావించాలి. జాతీయ స్థాయిలో మూడో ప్ర త్యామ్నాయం ఉండాలనేది నా అభిప్రాయం. దానికి సీఎం కేసీఆర్ నాయకత్వం వహిస్తే బాగుంటుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడు దేశ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని ఎవరైనా సరే గొప్ప విషయం గానే తీసుకోవాలి. గతంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ.నర్సింహరావు ప్రధాని అయ్యారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులేస్తున్నారు. దీనిని ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి. ఈ పథకాలు, అభివృద్ధి మోడల్ను దేశ ప్రజలకు అందించాలనే సీఎం కేసీఆర్ ఆకాంక్ష మంచిదే. సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణను సాధించిన సీఎం కేసీఆర్, దేశ రాజకీయాల్లో సమర్థవంతంగా రాణించగలరు.
-కాటేపల్లి మల్లయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయుడు (నారాయణఖేడ్)
దేశం అభివృద్ధి చెందుతుంది..
తెలంగాణకు సీఎం కేసీఆర్ చేస్తున్న పనులు అద్భుతం. సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వృద్ధాప్యంలో పిల్లలు తిండి పెట్టకున్నా ‘ఆసరా’ భరోసానిస్తున్నది. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలకు వెళ్తే దేశం కూడా సర్వతోముఖాభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. మన రాష్ట్రం నుంచి దేశ రాజకీలయకు సీఎం కేసీఆర్ వెళ్లడం శుభపరిణామం.
– తడుక నాగభూషణం, రిటైర్డ్ ఉపాధ్యాయుడు, ఆర్సీపురం
సీఎం కేసీఆర్ ఓ బలమైన నేత
జాతీయ రాజకీయాల్లో ఒక బలమైన నేత అవసరం. కేంద్రంలో నెగ్గాలంటే శక్తి, యుక్తులు కావాలి. అది సీఎం కేసీఆర్కు కావాల్సినంత ఉన్నాయి. మిత్ర పక్షాలను నమ్మితే కష్టం. ముందుకు తోసి పక్కకు జరుగుతారు. మిత్రపక్షాలను నమ్మకుండానే ముందుకు వెళ్లాలి.
– పట్లోళ్ల అనంతరెడ్డి, రిటైర్డ్ ఎంఈవో(జిన్నారం)
దేశానికి సరైన నేత.. సీఎం కేసీఆర్
ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పేదలకు న్యాయం జరగడం లేదు. సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. కేవలం కార్పొరేట్ వ్యవస్థ బలోపేతమవుతున్నది. దీన్ని అధిగమించి అన్ని వర్గాలకు సమన్యాయం జరగడం, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ముందుచూపు, అవగాహన కల్గిన నాయకత్వం అవసరం. దేశానికి సరైన నాయకుడు కేసీఆర్. తెలంగాణ మాదిరిగా దేశమంతా సంక్షేమ పథకాలు అమలవ్వాలి.
– వెంకటరమణ, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు (వెల్దుర్తి)
మన పథకాలను విస్తరింపజేయాలి..
ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రజలు బాగుపడాలని దేశ రాజకీయాలను చేస్త్తుండు. అయనకు మనందరం మద్ధ్దతు పలకాలి అప్పుడే దేశం బాగుపడుతుంది. సీఎం కేసీఆర్ రాజీ పడకుండా రాష్ర్టాన్ని బాగు చేసిండ్రు. దేశంలో కూడా చక్రం తిప్పి పగ్గాలను సీఎం కేసీఆర్ చేత పట్టాలి అప్పుడే రాష్ర్టాలన్నీ సస్యశ్యామలమవుతాయి. మన తెలంగాణ పథకాలను అన్ని రాష్ర్టాలకు విస్తరింపజేయాలని మా కోరిక.
-వి.శంకర్, విశ్రాంత ఉద్యోగ సంఘం,
రామాయంపేట మండలాధ్యక్షుడు
విజన్ ఉన్న నేత ‘సీఎం కేసీఆర్’
దేశంలో ధరల భారం సామాన్యుడు మోయలేక పోతున్నాడు. జాతీయ స్థాయిలో రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. రాష్ర్టాలతో సమన్వయం లేకుండా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లోకి సమర్థులు రావడం అనేది అవసరం. సీఎం కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశమంతటికీ ఆయన ఉపయోగపడుతారు. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో పెనుమార్పు తప్పదు. దక్షిణాది రాష్ర్టాలు సత్తా చాటాలంటే ఇదే మంచి సమయం. తెలంగాణ ప్రజలతో పాటు దేశ ప్రజలందరి ఆశీస్సులు సీఎం కేసీఆర్కు ఉంటాయి.
-చౌరిగారి దశరథరాములు, రిటైర్డ్ ఆర్ఎస్సై, కొల్చారం
జాతీయ రాజకీయాల్లో సరైన ప్రతిపక్షం లేదు..
ప్రస్తుత దేశ రాజకీయాల్లో సరైన ప్రతిపక్షం లేదు. సీఎం కేసీఆర్ సరైన సమయంలో తన అపార అనుభవాలను రంగరించి దేశ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం. కేంద్ర బీజేపీ ఎన్ని తప్పులు చేసినా వేలెత్తిచూపే నాయకులు లేకుండా పోయారు. దక్షిణ భారతదేశ సమస్యలు సీఎం కేసీఆర్ కు బాగా తెలుసు. దేశంలోని అన్ని ఫ్రంట్లు కేసీఆర్ వెంట వచ్చే అవకాశం మెండుగా ఉన్నాయి. దక్షిణాది రాష్ర్టాల నుంచి సీఎం కేసీఆర్ పీఎం అయితే చరిత్ర పుటల్లోకి ఎక్కడం ఖాయం.
-రమణారెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం శివ్వంపేట