చేర్యాల, జూన్ 18 :యువతకు బీజేపీ తీరని అన్యాయం చేసేందుకే అగ్నిపథ్ తీసుకొచ్చిందని టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అన్నారు.అగ్నిపథ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న యువకుల పై కేంద్ర బలగాలు కాల్పులు జరపడంతో నర్సంపేట ప్రాంతానికి చెందిన రాకేశ్ మృతి చెందిన విష యం తెలిసిందే. సంతాప సూచకంగా పూర్వపు వరంగల్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీకి చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల నుంచి 200 వాహనాల్లో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ .కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పాలన చేయడం సరికాదన్నారు. ఇప్పటికే రాష్ర్టాల హక్కులు హరించి కక్షపూరితంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. వెంటనే అగ్నిపథ్ను రద్దు చేయాలని, లేని పక్షంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. తరలిన వారిలో ఎంపీపీలు బద్దిపడిగె కృషారెడ్డి, వుల్లంపల్లి కరుణాకర్, తలారీ కీర్తనాకిషన్, జడ్పీటీసీలు సిలువేరు సిద్ధప్ప, మల్లేశం, మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు నిమ్మ రాజీవ్రెడ్డి, పుర్మ వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అనంతుల మల్లేశం, మేక సంతోష్, గీస భిక్షపతి, మంద యాదగిరి, వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ నాగిల్ల తిరుపతిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్సయ్య, కౌన్సిలర్ సతీశ్ ఉన్నారు.
అగ్నిపథ్ను ఉపసంహరించుకోవాలి
అగ్నిపథ్ను వెంటనే ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్వీ శాతవాహన యూనివర్సిటీ ఇన్చార్జి చుక్క శ్రీనివాస్ అన్నారు. శనివారం మండంలోని రామచంద్రాపూర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అగ్నిపథ్ నిర్ణయంతో దేశ యువత గొంతు నొక్కాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటన దురదృష్టకరమన్నారు. రైల్వేవ్యవస్థ కేంద్ర ఆధీనంలో ఉన్న విషయం తెలిసి కూడా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్ ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టడం సిగ్గుచేటన్నారు. మోదీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.
‘అగ్నిపథ్’ను వెనక్కి తీసుకోవాలి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని.. పాత పద్ధతి ప్రకారమే ఆర్మీ రిక్రూట్మెంట్ కొనసాగించాలని టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మెరుగు మహేశ్ అన్నారు. సిద్దిపేటలోని మంత్రి హరీశ్రావు నివాసంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ వల్ల దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత రోడ్డుపైకి వచ్చి చేస్తున్న ఆందోళనకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యాల్లో తెలంగాణ జరుగుతున్న ఉద్యమం వెనుక టీఆర్ఎస్ ఉందనడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఉంటే ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎవరున్నారన్నారు. నీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరించాలి లేకుంటే టీఆర్ఎస్పై బురద జల్లే పద్ధతి మానుకోవాలని హితవు పలికారు. టీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షుడు గరిపల్లి మహిపాల్గౌడ్, టీఆర్ఎస్వీ నాయకులు విజయ్, రవి, పరశురాములు, గుజ్జ రాజు, సతీశ్, రాచకొండ భిక్షపతి, భూక్యా భిక్షపతినాయక్, మైలారం వంశీ, రాగారం రాము, లక్కిరెడ్డి కిశోర్రెడ్డి, మన్నె బాబు, అప్పాల శేఖర్యాదవ్, బాబు, రాజశేఖరెడ్డి, సతీశ్రెడ్డి పాల్గొన్నారు.
ప్రధాని రాజీనామా చేయాలి
అగ్నిపథ్ ఆందోళనలకు కారణమైన ప్రధాని నరేంద్రమోదీ వెంటనే రాజీనామా చేయాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలతో రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేశారని, రైతు ఉద్యమంతో వెనక్కి తగ్గి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు అగ్నిపథ్తో యువత నోట్లో మట్టి కొట్టాలని ప్రయత్నిస్తున్నారన్నారు. జైజవాన్, జైకిసాన్ అన్న దేశంలో నల్లచట్టాలతో రైతులను, ప్రజలను తీవ్ర ఇబ్బందులగు గురి చేస్తున్నారని ఆరోపించారు. గత 70 ఏండ్లలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని, దేశంలో మోదీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చర్యలు చేపట్టడం లేదన్నారు. ఇప్పటికైనా అవాకులు, చవాకులు పేలడం మానుకోవాలని బీజేపీ నాయకులను హెచ్చరించారు.
అగ్నిపథ్తో నిరుద్యోగుల జీవితాలు బుగ్గిపాలు
అగ్నిపథ్తో మోదీ సర్కార్ నిరుద్యోగుల జీవితాలను బుగ్గిపాలు చేస్తుందని గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. శనివారం గజ్వేల్ మార్కెట్ కమిటీలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నిరుద్యోగులు, పేదల జీవితాలతో మోదీ ప్రభుత్వం చెలగాటమాడుతుందన్నారు. సంస్కరణల పేరుతో కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. దేశంలోని ఉద్యోగఖాళీలు భర్తీ చేయాలని యువత కోరుతుంటే ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని ఆరోపించారు. దేశానికి కంటికి రెప్పలా కాపలా కాసే సైనికుల విషయంలో కూడా ఆర్థిక ప్రయోజనాల కోసం ఆలోచించడం కేంద్ర ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. గతంలో మాదిరిగానే సైనిక దళాల రిక్రూట్మెంట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాలను అంబానీ, ఆదానీలకు అప్పగించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని,లేని పక్షంలో యువత ఉధృతంగా పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ ఉపేందర్రెడ్డి, డైరెక్టర్లు మతిన్, ప్రవీణ్, కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్, గజ్వేల్ మండల ప్రధాన కార్యదర్వి రమేశ్గౌడ్, నాయకులు నర్సింహ, వినయ్రెడ్డి, షాదుల్, శివసాగర్,నవాజ్, కనకయ్య, అఖిల్, యోగేందర్ సాయి, మహంకాళీ, యాదగిరి పాల్గొన్నారు.
యువత భవిష్యత్తో ఆడుకుంటున్న కేంద్రం
యువత భవిష్యత్తో కేంద్రం ఆడుకుంటోందని టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు పెంబర్ల రాజశేఖర్, టీఆర్ఎస్వై పట్టణ అధ్యక్షుడు యాట భిక్షపతి అన్నారు. అగ్నిపథ్ను రద్దు చేయాలని నిరసన చేపట్టిన యువకుల పై కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో రాకేశ్ మృతిచెందిన విషయం తెలిసిందే. పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్వై, టీఆర్ఎస్వీ నాయకులు సంతాపం తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది యువకుల భవిష్యత్ అంధకారంలో పడిందన్నారు.వెంటనే అగ్నిపథ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో నాయకులు మహ్మద్ తహెర్, ఈరు పవన్, గుడాల శ్రవణ్కుమార్, సందీప్, వరుణ్ పాల్గొన్నారు.