సిద్దిపేట జోన్, మే 3 : సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల్లో కొంతమంది తమ సతీమణులను బరిలోకి దింపి గెలిపించుకున్నారు. మున్సిపల్ చైర్మన్గా రెండు పర్యాయాలుగా బాధ్యతలు నిర్వర్తించిన రాజనర్సు, ఈసారి చైర్మన్ పదవి మహిళకు రిజర్వ్ కావడంతో 24వ వార్డు నుంచి తన సతీమణి మంజులను బరిలో నిలిపి గెలిపించుకున్నారు. రెండుసార్లు కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా వ్యవహరించిన అక్తర్ పటేల్, తన వార్డు మహిళకు రిజర్వ్ కావడంతో 21వ వార్డు నుంచి తన సతీమణి నాజియా తప్స్మ్ అక్తర్ను బరిలో నిలిపి గెలిపించుకున్నారు. రెండుసార్లు కౌన్సిలర్గా గెలిచిన వజీరొద్ద్దీన్ ఈసారి 30వ వార్డు తన సతీమణి ఫాతిమా బేగాన్ని బరిలో నిలిపి విజయం సాధించారు. పోయిన సారి సిట్టింగ్ కౌన్సిలర్గా ఉన్న మోయిజ్ ఈసారి ఆ వార్డు మహిళకు రిజర్వ్ కావడంతో తన సతీమణి తస్లీమాను బరిలో నిలిపి గెలిపించుకున్నారు. పోయిన సారి సిట్టింగ్ కౌన్సిలర్గా ఉన్న తేల్జీరు శ్రీనివాస్యాదవ్ ఈసారి తన సతీమణి రేఖను బరిలో దింపి గెలిపించుకున్నారు.
నాడు సతులు.. నేడు పతులు
టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జంగిటి కనకరాజు పోయిన సారి తన సతీమణి కవిత కౌన్సిలర్గా ఉండగా, ఈసారి ఆయన 31వ వార్డు నుంచి పోటీచేసి గెలుపొందారు. నాయకం లక్ష్మణ్ సతీమణి గతంలో కౌన్సిలర్గా ఉండగా, ఈసారి తానే 23వ వార్డు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ధర్మవరం సప్న గతంలో కౌన్సిలర్గా గెలువగా, ఈ సారి తన భర్త బహ్నం 38వార్డు నుంచి గెలుపొందారు.