కొమురవెల్లి, మార్చి 17 : ఆరోగ్య తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని లెనిన్నగర్కు చెందిన ములుగు నర్సింహులు కుమార్తె నాగజ్యోతి అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ దవఖానలో చికిత్స పొందుతున్నది. కాగా, అత్యవసర చికిత్స నిమిత్తం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.లక్షా ఇరువై ఐదు వేల ఎల్వోసీని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గురువారం బాధితురాలి కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి నిరుపేద కుటుంబాలకు కార్పొరేటు స్థాయి వైద్యం ఉచితంగా అందించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు దాసరి మచ్చేందర్, నాయకులు దాసరి పెద్ద నర్సింహులు, ప్రకాశ్ తదితరులు ఉన్నారు.