మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్17: తీవ్ర కరువు ప్రాంతంగా పేరొందిన ధూళిమిట్ట నడిగడ్డను గోదావరి జలాలు ముద్దాడాయి. ఆదివారం రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా ధూళిమిట్ట మండల కేంద్రానికి గోదావరి జలాలు చేరుకున్నాయి. ఎండకాలంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంట చేతికందే సమయంలో పొలాలు ఎండిపోతున్న దశలో గోదావరి జలాలు పొలాలకు చేరుకుంటున్నాయి. దీంతో ధూళిమిట్ట గ్రామ రైతులతో పాటు పరిసర గ్రామాల రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి జలాలు అందించాలని ఈ నెల 13న ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్ దుబ్బుడు దీపికావేణుగోపాల్రెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో స్పందించిన మంత్రి నాలుగు రోజుల వ్యవధిలోనే గోదావరి జలాలను ధూళిమిట్టకు అందజేశారు. కాగా ధూళిమిట్టకు గోదావరి జలాలను అందించిన మంత్రి హరీశ్రావుకు ఎంపీపీ కృష్ణారెడ్డి, సర్పంచ్ దీపికావేణుగోపాల్రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.