రాయపోల్, మార్చి 31. సీఎం రిలీఫ్ ఫండ్(CMRF) పేద ప్రజలకు ఎంతో వరం లాంటిదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotta Prabhakar Reddy) అన్నారు. రాయపోల్ మండలం ఎల్కంటి గ్రామానికి చెందిన జాల రమేష్కు రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును సోమవారం ఆయన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్తి వెంకటయ్యతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం కోసం ఖర్చు చేసిన డబ్బులను తిరిగి సీఎంఆర్పథకం ద్వారా పొందడం పేదలకు ఆసరాగా నిలుస్తుంది తెలిపారు.
దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ పథకాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే అత్యవసర వైద్య సేవలు ఉన్నవారికి ఎల్ఓసి కూడా అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. పేదల సంక్షేమ ధ్యేయంగా కృషి చేస్తున్నామని, గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
సీఎంఆర్ పథకం పేదలకు ఎంతో భరోసాగా నిలుస్తుందని, ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకొవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మాజీ సర్పంచ్ చిరంజీవి, మండల నాయకులు పాపని వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.