రాయపోల్, మే 12 : మండు వేసవిలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తున్నామని డీసీసీ ఉపాధ్యక్షులు పలుపునూరి ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు పోలీసు స్టేషన్కు పలు గ్రామాల ప్రజలు వస్తుంటారని, రహదారి వెంబడి ఎందరో ప్రయాణికులు వెళ్తుంటారని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున అందరికీ తాగునీటి అందించాలని ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
రాయపోల్ మండలంలోని పలు గ్రామాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని డీసీసీ ఉపాధ్యక్షులు పలుపునూరి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ఎండలు మండుతున్న ఈ రోజుల్లో ప్రధాన రహదారిపై చలివేంద్రాలతో ప్రజల దాహార్తి తీర్చడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. చలివేంద్ర ఏర్పాటు కార్యక్రమంలో సీనియర్ నాయకులు కిష్టారెడ్డి, మాజీ జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు ఉశన్నగల్ల స్వామి, యూసుఫ్, నర్సింగరావు, నాగేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.