సిద్దిపేట : సిద్దిపేటలో మంత్రి హరీష్రావు (Minister Harish Rao)కు ఈ ఎన్నికల్లోనూ మెజార్టీ పెరగడం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు(Brs Leaders) మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పట్టణ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి, జాప శ్రీకాంత్ రెడ్డి,పాల సాయిరాంలు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
ఎన్నికల ప్రచారం (Election Campaign) లో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసినపుడు ప్రజల నుంచి అపూర్వ స్పందన (Response) వచ్చిందని పేర్కొన్నారు. అన్ని కుల సంఘాలు, అసోసియేషన్ల నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి హరీశ్రావుకు మద్దతు(Support) తెలిపారని వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని పొందిన హరీశ్రావు భారీ మెజార్టీ సాధించడం ఖాయమని అన్నారు.
సిద్దిపేటలో జరిగిన అభివృద్దిని చూసి ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేశారని తెలిపారు. పోలింగ్ శాతం తగ్గినప్పటికీ హరీశ్రావుకు మాత్రం ఓట్లు పెరుగుతాయని అన్నారు. సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు మెరుగు మహేష్, వడ్లకొండ సాయి, పలువురు పాల్గొన్నారు.