సిద్దిపేట, జనవరి 16: పది ఫలితాల్లో సిద్దిపేట నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలిచేలా కలిసికట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నియోజకవర్గం విద్యాధికారులు, ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ సూల్స్, కస్తూర్బా రెసిడెన్షియల్ సూల్స్ ప్రధానోపాధ్యాయులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో గత స్ఫూర్తి కొనసాగించాలని, 100 శాతం ఫలితాలు వచ్చేలా సమిష్టి కృషి చేయాలని సూచించారు. సిద్దిపేటకు ఉన్న ప్రతిష్ట, గౌరవాన్ని కొనసాగించాలన్నారు. ఇప్పటికే సిలబస్ పూర్తైయితే ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలు ఎకువగా ఉంటారని, వారిలో ఆత్మవిశ్వాసం నింపాలన్నారు. ఫలితాలపై ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు.
ఇంటి వద్ద ఫోన్లు వాడకుండా, టీవీలు చూడకుండా ఉండేలా చెప్పాలని, తల్లితండ్రులతో మీటింగ్ ఏర్పాటు చేసి పిల్లల చదువుకు పదో తరగతి తొలిమెట్టు అని, ఈ రెండు నెలలు చదువుపై దృష్టి సారించేలా తల్లిదండ్రుల్లో ఆత్మవిశ్వాసం నింపాలని, విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పించాలని సూచించారు. విద్యార్థులకు సాయంత్రం వేళలో స్నాక్స్ అందించాలని, అందుకు పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా కేర్ టీచర్ను ఏర్పాటు చేయాలని చెప్పారు. కేర్ టీచర్స్తో తాను 15 రోజులకొక సారి మాట్లాడుతానన్నారు. ఇలా పక్కా ప్రణాళిక చేసుకుని, గత స్ఫూర్తితో ముందుకెళ్దామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా విద్యాశాఖ నోడల్ అధికారి రామస్వామి, ఎంఈవోలు శ్రీనివాస్రెడ్డి, యాదవరెడ్డి, దేశిరెడ్డి ఉన్నారు.